CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెల్లవారుజామున పూరిళ్లు దగ్ధం

Share it:

 


 వీధినపడ్డ నిరుపేద కుటుంబం



 మన్యంటీవీ,అశ్వారావుపేట:  అకస్మాత్తుగా మంటలు చెలరేగి మంగళవారం తెల్లవారు జామున పూరిల్లు దగ్ధం కాగా.. నిరుపేద కుటుంబం వీధిన పడింది. ఈ ఘటన అశ్వారావుపేట మండలంలోని పేరాయి గూడెం గ్రామ పంచాయతీలోని డ్రైవర్స్ కాలనీ లో చోటు చేసుకుంది. కాలనీకి చెందిన తోకల రాములమ్మ, మధు  కుటుంబ సభ్యులతో తన ఇంట్లో నిద్రించగా మంగళవారం తెల్లవారు జామున అనుకోకుండా  మంటలు చెలరేగి గుడిసెకు అంటుకున్నాయి. మంటల వేడికి నిద్రలేచిన కుటుంబ సభ్యులు వెంటనే బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. మంటల్లో ఇంటితో పాటు సామగ్రి పూర్తిగా కాలిపోయింది. తన దాచుకున్న 150000/- నగదు  ఆధార్‌, రేషన్‌ కార్డు, వస్తువులు, దుస్తులు పూర్తిగా కాలిపోయినట్లు బాధితులు తెలిపారు. ఇల్లు కాలిపోవడంతో బాధిత కుటుంబం వీధిన పడగా.. గ్రామస్తులు సహకారం అందించారు. సర్పంచ్‌ సుమతి రైస్ బ్యాగ్, చేగువేరా ఫౌండేషన్ ద్వారా రైస్ నిత్యావసర సరుకులు, ఎంపీటీసీ వేములభారతి దుప్పట్లు, దస్తగిరి, ఎస్ మార్ట్ షాప్ వాళ్లు రైస్, నిత్యావసర సరుకులు బాధిత కుటుంబానికి  అందించారు.

Share it:

TELANGANA

Post A Comment: