మన్యంటీవీ ఏటూరునాగారం:
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జంపన్న వాగు లో మునిగి స్థానిక రెడ్డిగూడెం గ్రామం కు చెందిన మెండు సంపత్ రెడ్డి పిల్లలు అయినా హేమంత్ (8), జాహ్నవి( 14) మృతి చెందారు. మేడారం వచ్చిన చుట్టాలతో కలిసి జంపన్న వాగు దగ్గర స్నానం కి వెళ్లిన ఓకే ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు వాగులో మునిగి చనిపోవడం తో గ్రామం లో విచాదా ఛాయలు అలుముకున్నాయి.
జంపన్న వాగులో నీటమునిగి ప్రదేశం కి వచ్చిన సీతక్క యువసేన మండల అధ్యక్షులు చేర్ప రవీందర్ మాట్లాడుతూ ప్రతి వారం ఒక భక్తుడు చనిపోతున్న ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టడం లేదు అని, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే చనిపోతున్నారని అన్నారు. మృతుల కుటుంబానికి రూ.10 లక్షలు నష్ట పరిహారం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.
Post A Comment: