CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైస్ మిల్-బ్రిక్స్ ప్లాంట్ నుండి వస్తున్న దుమ్మూ దూళిని నివారించాలని వినతి

Share it:


మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండలం గౌతమినగర్ కాలనీ గేట్ ఎదురుగా శ్రీ వెంకట కనక దుర్గా రైస్ మిల్లు నుండి వెలువడుతున్న ఊక మరియు పక్కన ఉన్నటువంటి ఫ్లై-యాష్ బ్రిక్స్ పౌడర్ ను  మా ఇళ్లలోకి రాకుండా నివారించాలని కోరుతూ అశ్వాపురం తహశీల్దార్ పి.రామకృష్ణ కి కి ముస్లిమ్ కాలనీకి చెందిన ప్రజలు వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు రైస్ మిల్ నుండి వస్తున్న ఊక మా ఇండ్లలోకి పడుతున్న కారణంగా ఎలర్జీ లాంటి చర్మవ్యాధులు మరియు శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నామని అలాగే ఫ్లై-యాష్ బ్రిక్స్ నుండి వస్తున్న పౌడర్ ఇళ్లలోకి పడుతున్నది,అందులో పనిచేస్తున్న కార్మికులకు మరుగుదొడ్ల సౌకర్యం లేక ఇండ్ల సమూహం ప్రభుత్వ దవాఖానకు వెళ్లే రహదారి పక్కనే బహిరంగ మలవిసర్జన చేస్తున్నారని వీరి వల్ల దుర్వాసన సమస్యతో పాటు అనేక రకాల అంటువ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని మా ఇళ్లలోకి ఊక-పౌడర్-దుమ్మూ-దూళి రాకుండా మిల్లు యజమానుల పై తగు చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో యలమంద, యాదగిరి,

రాకేష్,కృష్ణయ్య,ముస్తాఫా,గద్దల. నాగేశ్వరరావు,షేక్ నయీమ్,వీరభద్రారెడ్డి, జమీల్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: