మన్యంటీవీ ఏటూరునాగారం:
ఆదివారం రోజున శ్రీ సమ్మక్క సారలమ్మ గోవిందరాజులు మరియు పగిడిద్దరాజు ల పూజారులు అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో సమావేశం ఏర్పాటు చేసి ఫిబ్రవరి లో జరగబోవు మినీ జాతర (మండ మెలిగే పండుగ) తేదీలను ప్రకటించినారు.
24-02-2021 బుధవారం రోజున గుడి శుద్ధి మరియు పూజాకార్యక్రమాలు అదే రోజు ఉదయం 10 గంటలకు గ్రామ ద్వార స్తంభాలు స్థాపించుట.
25-02-2021 గురువారం రోజున అమ్మవార్లను పసుపు కుంకుమలతో అర్చన.
26-02-2021 శుక్రవారం రోజున అమ్మవార్లను దర్శించు కొనుట.
27-02-2021 శనివారం రోజున అమ్మవార్ల పూజా కార్యక్రమాలతో జాతర ముగుస్తుందని పూజారుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు సిద్ధబోయిన జగ్గారావు, చందా గోపాల్ రావులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఆలం రాంమూర్తి, సమ్మక్క సారలమ్మ పూజారులు సిద్దబోయిన స్వామి, కాక సారయ్య, సిద్దబోయిన అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: