నూగురు వెంకటాపురం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణ వాస్తవ్యులు శ్రీ భమిడిపాటి సురేష్ కుమార్ మరియు భమిడిపాటి గాయత్రి తమ స్నేహితురాలి పుట్టినరోజు సందర్భంగా ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రాపురం గ్రామ పరిధిలో నడపబడుతున్న గ్రేస్ హోమ్ అనాధ ఆశ్రమంను సందర్శించడం జరిగింది. అక్కడ వృద్ధులతో పుట్టిన రోజు వేడుకలను జరిపి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు తమ వెంట తీసుకు వచ్చినటువంటి పండ్లను కూడా అందజేశారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి గ్రేస్ హోమ్ నిర్వాహకురాలు కారం రాధా మాట్లాడుతూ మీలాంటి వారి సహాయసహకారాలు ఆదరాభిమానాలు మాపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ,.... ధన్యవాదాలు అని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోస్ట్ మాస్టర్ బెజ్జంకి నారాయణ,గ్రామీణ వైద్యులు రామినేని రాజేంద్ర ప్రసాద్ ,బొగ్గుల పుష్ప,కారం రాజు తదితరులు పాల్గొనడం జరిగింది.
Post A Comment: