CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అద్వాన్నంగా ఉన్న రోడ్లు, జరుగుతున్న అవకతవకలపై అధికారులు, ఎమ్మెల్యే, కలెక్టర్ దృష్టిసారించాలి

Share it:

 


 మన్యం టీవీ మంగపేట. 


మంగపేట మండలం కేంద్రంలో ములుగు జిల్లా ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు. శ్రీ గుమ్మడి సోమయ్య గ అధ్యక్షతన పత్రికా విలేకరుల సమావేశం జరిగినది. ఈ సమావేశంలో మాట్లాడుతూ మన ములుగు ఎమ్మెల్యే  సీతక్క  మంగపేట పర్యటనలో భాగంగా మంగపేట కేంద్రంలోని వైయస్సార్ సెంటర్ నుండి కోమటిపల్లి క్రాస్ వరకు రోడ్డు అధ్వానంగా ఉందని మన ములుగు జిల్లా కలెక్టర్ తో మాట్లాడి  రోడ్డు మరమ్మత్తులు  చేయాలని కలెక్టర్ ను  కోరగా  ఈ రోడ్డు కి సుమారు యాభై  లక్షలు ఖర్చు వస్తుంది అని చెప్పినారు దానికిగాను జిల్లా కలెక్టర్ ఫండ్ ముప్పై లక్షలు మంజూరు చేస్తూ మిగతా ఇరవై  లక్షలు మండల జనరల్ ఫండ్ నుంచి ఇరవై లక్షలు,  మొత్తం యాభై లక్షలు టెండర్లు పిలిచి రోడ్డు పని పూర్తి చేయాలని. ఆదేశాలు పంపినారు. కానీ మండల నిధులు ఇరవై లక్షలు గ్రామపంచాయతీ కార్యాలయము లో వీ.డీ.సీ కమిటీ సభ్యుల ద్వారా . గ్రామములో చెందిన వ్యక్తి పేరుమీద. వీ.డీ.సీ . ఉండగా,  మండల ఎం.పీ.డీ.వో మరియు స్పెషల్ ఆఫీసర్ అధికార పార్టీ నాయకులతో కుమ్మకై. లక్ష రూపాయల కమిషన్తో. మాట్లాడుకొని, ఒక నాయకుడికి కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. కాగా మన ఎమ్మెల్యే  ఎం.పీ.డీ.వో.కు  గారికి ఫోన్ చేసి ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పిన వారి స్పందించకుండా వాళ్ల ఇష్టానుసారం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని మరల కలెక్టర్  దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే  సీతక్క ఇరవై లక్షల టెండరు నిర్వహించే విధంగ చర్యలు తీసుకోవాలి. రోడ్డు పని నాణ్యతగా చేయించాలని కోరినారు.. ఈ కార్యక్రమంలో ఎస్టీసెల్ మండల అధ్యక్షులు చధా మల్లయ్య,  కిసాన్ సెల్ మండల అధ్యక్షులు  చౌలం వెంకటేశ్వర్లు,  మంగపేట మండలం ఉపాధ్యక్షులుతుడి భగవాన్ రెడ్డి,  జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు దామర సారయ్య,  కారు పోతుల నర్సయ్యగౌడ్, ఎం డీ  మహబూబ్ ఖాన్, బండి పల్లి రవి, సురేష్,  తోట అశోక్ కుమార్,  సీతక్క యువసేన మండల అధ్యక్షులు . సిద్ధ బత్తుల జగదీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: