-👉టీబీజీకేఎస్ నేత ఎండీ రజాక్
మన్యం టీవీ కొత్తగూడెం ప్రతినిధి
సింగరేణి లో పనిచేస్తున్న సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని టీబీజీకేఎస్ నేత ఎండీ రజాక్ సింగరేణి యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేశారు. రామవరం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్యాలయంలో సెక్యూరిటి డిపార్ట్మెంట్ సమస్యలపై శుక్రవారం ముఖ్య కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రజాక్ మాట్లాడుతూ.. సింగరేణిలో సెక్యూరిటి డిపార్ట్మెంట్ అత్యవసర మైనదని దీనిని దృష్టిలో పెట్టుకుని సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. సెక్యూరిటీ కార్మికులకు తగ్గించిన ప్లేడెలు పెంచాలని, రాబోవు ఎండాకాలం లో చెక్ పోస్ట్ లలో సౌకర్యాలు కల్పించాలని, చెక్ పోస్ట్ పరిసరాలలో దుమ్ము అధికంగా ఉందని ఈ సమస్య పరిష్కారానికి వాటర్ స్ప్రేయింగ్ చేయించాలని కోరారు. క్యాంటీన్ లో టిఫిన్ రకాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. విధి నిర్వహణ వద్ద లైటింగ్ పెంచాలని యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో 11 మెన్ కమిటీ సభ్యులు కాపు కృష్ణ, రీజనల్ సెక్రెటరీ కుశన వీరభద్రమ్, ట్రేసరార్ గొపు కుమార్, పిట్ సెక్రెటరీ చేరిపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: