CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గిరిజన పోడు భూములు గిరిజనులకే చెందాలి

Share it:

 



 మన్యం టీవీ, దమ్మపేట

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,  దమ్మపేట మండలం, సరోజనపురం లో చిలకల శ్రీనివాసరావు ఇంటి దగ్గర దమ్మపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మద్దిశెట్టి సత్య ప్రసాద్ అధ్యక్షతన సమావేశం జరిగింది.సమావేశం యొక్క ఉద్దేశం, మండలంలో గిరిజన భూములలో ఫారెస్ట్ అధికారులు కందకాలు తవ్వుతున్నారు,50 సంవత్సరాలుగా సాగులో ఉన్న పోడు భూములకు హక్కు పత్రాలు ఉన్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు కందకాలు తవ్వుతున్నారు.అధికార పార్టీ ఎమ్మెల్యే మాటల వరకే పరిమితం అవుతున్నారు ఫారెస్ట్ అధికారుల కి అడ్డు చెప్పడం లేదు,యదేచ్ఛగా ఫారెస్ట్ అధికారులు కాలువలు తవ్వుతున్నారు.ఆదివాసీ గిరిజనులకు పొడు భూములకు హక్కులు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు ఆండగా నిలిచి పోరాటం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మహిళా జనరల్  సెక్రటరీ సున్నం నాగమణి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట మండల మైనార్టీ అధ్యక్షుడు ఎం డి జానీ, ఎస్టీ మండల నాయకులు చిలకల శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ మండల నాయకులు కందుల వెంకటేశ్వరరావు,  కిసాన్ సెల్ అధ్యక్షుడు ఎస్కే స్కోర్,దమ్మపేట మండలం నాయకులు కె నాగబాబు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: