👉బహుమతులు ప్రధానం చేసినసర్పంచ్ కొర్సా కృష్ణంరాజు,ఉప సర్పంచ్ నిట్టా వెంకటేశ్వర్లు
మన్యం టీవి,పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం భూపాలపట్నం గ్రామంలో సర్పంచ్ కొర్సా కృష్ణంరాజు,ఉప సర్పంచ్ నిట్టా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పంచాయతీ గేమ్స్ నిర్వహించడం జరిగింది. ఈ ఆటల పోటీలలో యువతీ, యువకులు పాల్గొన్నారు.ముగ్గుల పోటీలలో మొదటి బహుమతిగా నీలమ్మ,రెండో బహుమతిగా నాగ,మూడో బహుమతి గా శ్రీదేవి గెలుచుకున్నారు.అలాగే వాలీబాల్ టోర్నమెంట్ లో మొదటి బహుమతి బొగ్గం కళ్యాణ్ టీం గెలుచుకున్నారు. మహిళల కబడ్డీ పోటీలలో మొదటి బహుమతిగా తోలెం అరుణ టీం ,రెండో బహుమతిగా బొగ్గం సరిత గెలుచుకున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ ,ఉప సర్పంచ్ మాట్లాడుతూ పంచాయతీ గేమ్స్ కు గ్రామస్తులు సహకరించి సంక్రాంతి పండుగను ఆనందంగా గడపడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు .ఈ కార్యక్రమంలో భూపాలపట్నం పంచాయతీ గ్రామస్తులు పాల్గొన్నారు .
Post A Comment: