మన్యంటీవీ ఏటూరునాగారం/ములుగు:
ములుగు జిల్లా లో రేపు ఉదయం నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంబోత్సవం కానున్న నేపథ్యంలో జిల్లా అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి ఏరియా ఆసుపత్రి ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్ ఏర్పాట్ల గురించి జిల్లా వైద్య అధికారి అల్లెం అప్పయ్యను అడిగి తెలుసుకున్నారు. వికలాంగుల కోసం ట్రే సైకిల్ ఏర్పాట్లు తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలోఏరియా హాస్పిటల్ సూపరిండెంట్ జగదీశ్వర్ , డాక్టర్ శ్యామ్, ఎమ్మార్వో సత్యనారాయణ స్వామి, మరియు ఆసుపత్రి వైద్యులు,మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: