కార్యకర్త కుటుంబానికి చెక్కును పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి తాటి వెంకటేశ్వర్లు
మన్యంటీవీ,అశ్వరావుపేట:మండలం పరిదిలోని కొత్త మామిళ్లవారి గూడెం గ్రామానికి చెందిన తెరాస కార్యకర్త కాటూరి వెంకటేష్ ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందారు,
వీరికి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండటంతో ప్రమాద భీమా వర్తించింది. ఈరోజు వారి నివాసంలో ఇందుకు సంబంధించిన రెండు లక్షల రూపాయల చెక్కులను మాజీ శాసనసభ్యులు తాటి వెంకటేశ్వర్లు వారి కుటుంబసభ్యులు కాటూరి మంగమ్మ కి అందించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తాటి మాట్లాడుతూ...
టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉండేందుకే ఈ భీమా సదుపాయం కల్పించినట్లు తెలిపారు. పార్టీ సభ్యత్వం పొంది ప్రమాదవశాత్తు చనిపోయిన ప్రతి కుటుంబానికి పార్టీ పక్షాన భీమా చేసి
₹2 లక్షల ప్రమాద బీమా ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వం కల్గివున్న ప్రతి కార్యకర్తకు భీమా సదుపాయం కల్పించిందని పార్టీ కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబసభ్యులకు అండగా నిలిచేందుకు ఈ ప్రమాద భీమా సదుపాయం కల్పిస్తామని అన్నారు. ఇలా ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు సర్పంచ్ నాగమణి, మాజీ జెడ్పిటిసి అంకత మల్లికార్జున్ రావు, పార్టీ ప్రెసిడెంట్ పొడపాటి సత్యనారాయణ, బిర్రం వెంకటేశ్వర రావు, రామినేని సత్యనారాయణ, పొట్ట రాజులు, తాండ్ర యుగంధర్, వనం బాబురావు, రాంబాబు, సూరి చంద్ర రావు, నల్లపు దుర్గారావు,
యువజన నాయకులు మోటూరి మోహన్, కొడాలి పండు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: