మన్యం టీవి,పినపాక:
జాతీయ బాలికల దినోత్సవం సందర్బంగా భారత తపాలా శాఖ ఆధ్వర్యంలో సుకన్య సమృద్ధి యోజన పథకం అవగాహన కార్యక్రమాన్ని సింగిరెడ్డి పల్లి పంచాయితీ పరిధిలో చేపట్టింది.దీనిలో భాగంగా పినపాక మండల తపాలా శాఖ అధికారులు ఇంటింటికి వెళ్ళి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భద్రాచల ఐ. పి.ఓ సుచెందర్, పోస్టల్ శాఖ సిబ్బంది మాట్లాడుతూ ప్రతి ఒక్క 10సంవత్సరాలలోపు ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులు సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని వినియోగించుకోవాలని వెయ్యి రూపాయల నుండి ఎంతవరకైనా పొదుపు చేసుకోవచ్చున్నారు . ఇరవై సంవత్సరాల తరువాత ఆడపిల్ల పెళ్లికి కానీ, వివాహానికి డబ్బులు అందుతాయని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించికోవలని కోరారు.ఈ కార్యక్రమంలో తపాలా సిబ్బంది దీక్షితులు,సర్వేశ్వర రావు, శ్రీరామ్ శ్రీనివాసరావు,సి.హెచ్. నాగేశ్వరరావు, చింతల పూడి బలరామ రావు,పున్నం విజయ్, పెద్ద చారి,ఉమేష్,బిక్షమయ్య,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: