CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మాదిగ జాగృతి చైతన్య రథయాత్ర ను విజయవంతం చేయండి మాదిగ జేఏసి భద్రాద్రి జిల్లా అధ్యక్షులుసిద్దెలతిరుమలరావు

Share it:

 


మన్యం టీవి, పినపాక: ఈరోజు ఆదివారం పినపాక మండలం బయ్యారం ఎల్సి రెడ్డిపల్లి గ్రామంలో మండల నాయకులు రావులపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన మాదిగ జేఏసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సిద్దెల తిరుమలరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాదారు. డిసెంబర్2 తారీఖున మాదిగ జేఏసి వ్యవస్థాపకులు ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి  తలపెట్టిన మాదిగల జాగృతి చైతన్య రథ యాత్ర ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ 12 శాతం రిజర్వేషన్ శీతాకాలం సమావేశాలు పార్లమెంటలో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో 32 జిల్లాలోని మాదిగ మాదిగల ఉపకులాలు పెద్ద ఎత్తున మాదిగ ను మరింత చైతన్యవంతం చేసి వర్గీకరణ పోరాటంలో భాగస్వామ్యం చేయడానికి ముందుకు సాగుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి జిల్లాలోని స్వాగతించడానికి సంసిద్ధులై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొడారీ నాగేశ్వరరావు, కొప్పుల శివాజీ, వెంకటేశ్వర్లు ,సతీష్ ,మల్లేష్, నరసింహారావు, నవీన్, ప్రశాంత్, నారాయణ, చందు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: