CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడుసాగుదారులు చలో కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండి సిపిఐ(ఎం) పార్టీ జిల్లా కమిటీ సభ్యులు:కొండపల్లి శ్రీధర్

Share it:


  మన్యంటీవీ అన్నపురెడ్డిపల్లి: అన్నపురెడ్డిపల్లి మండలం, రాజపురం(నర్సాపురం) గ్రామంలో ఆదివారం నాడు  పోడుసాగు  దారుల విస్తృత సమావేశం జరిగింది.ఈ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొండపల్లి శ్రీధర్ ప్రసంగిస్తూ, టిఆర్ఎస్ పార్టీ  పుట్టక ముందు నుంచి పోడుసాగుదారులు వ్యవసాయం సాగు చేస్తూ తిండిగింజలు, నిత్యవసర పంటలను పండిస్తూ ప్రజల అవసరాలను తీరుస్తున్నారని  ఇట్టి భూములకి పట్టాలు ఇస్తామని ఎన్నికల వాగ్దానం చేసి ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నెరవేర్చక పోగా ఫారెస్ట్ అధికారులను ఉసిగొలిపి భూముల నుంచి  వెళ్ళగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని,జనవరి 25వ తారీకున చలో కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి జంగిలివెంకటరత్నం నాయకులు డి అర్జుయ్య,పిట్టల లక్ష్మీనారాయణ,పోతిని రంగా,మారుతి రాఘవులు,బూరుగు సీతయ్య,మారుతి కన్నయ్య,నల్లమోతు రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: