మన్యం టీవీ, పినపాక:విద్యుదాఘాథానికి గురవడంతో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది.క్షతగాత్రుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పినపాక మండలతోగూడెం పంచాయతీ కి చెందిన గిరిజన వ్యక్తులు ఊకె కోటేశ్వరరావు,కోరం నారాయణలు వారి వరి పొలం సమీపంగా విద్యుత్ తీగలను సరిచేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ క్రమంలో లో ఇరువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీనితో క్షతగాత్రులను కుటుంబసభ్యులు కొత్తగూడెం హాస్పిటల్ కి తరలించి వైద్యం అందిస్తున్నారు.ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Post A Comment: