ఆర్థిక మంత్రి హరీశ్ రావు.
------------------------
తనను కలిసిన ఇన్ కమ్ ట్యాక్స్ ,ఐ.ఆర్.ఎస్ అధికారులతో మంత్రి హరీశ్ రావు.
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగ్లూరు గ్రామాన్ని దత్తత తీసుకున్న రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఇవాళ ఆర్థిక మంత్రి హరీశ్ రావును కలిశారు.
సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో కలిసిన ఐటీ అధికారులను మంత్రి హరీశ్ రావు అభినందించారు.
నిరంతరం విధుల్లో తీరిక లేకుండా గడిపే ఐటీ అధికారులు సామాజిక బాధ్యతగా గొంగ్లూరును దత్తత తీసుకుని ప్రజలకోసం పని చేయడం అభినందనీయమన్నారు.
అనంతరం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో తీసుకున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వారికి వివరించారు.
రైతు బంధు, రుణ మాఫీ, రైతు బీమా, మార్కెటింగ్ సదుపాయాల కల్పన పై ప్రభుత్వ చేపట్టిన కార్యక్రమాలను వారికి మంత్రి వివరించారు.
మిషన్ భగీరథ పథకం, మిషన్ కాకతీయ పథకాలు లక్ష్యం చేరుకుంటున్న తీరును వివరించారు. ఈ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు.
మిషన్ భగీరథ పధకం ద్వారా శుధ్ది చేసిన ఉపరితల నీటిని ఇంటింటికి అందిస్తున్నామన్నారు.
ప్రపంచంలో నే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మాణ నైపుణ్యాన్ని, ఆ ప్రాజెక్టు వల్ల సాధించిన విజయాలను వారికి వివరించారు.
సిద్దిపేట అభివృద్ధి ని వారు ఆసక్తి గా అడిగి తెలుసుకున్నారు. సిద్దిపేటకు వచ్చి అభివృధి జరిగిన తీరును చూస్తామన్నారు. ఇందుకు మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ వారిని సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం వారు గొంగ్లూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి మంత్రితో కలిసి వెళ్లారు.
ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: