మన్యంటీవీ,అశ్వారావుపేట: మండల వ్యాప్తంగా పల్స్ పోలియో ఆదివారం దిగ్విజయంగా నడుస్తోంది. నారాయణపురం లో జెడ్పిటిసి వరలక్ష్మి బాలబాలికలకు చుక్కలు వేసి పోలియో కేంద్రాన్ని ప్రారంభించారు. ఎంపీపీ శ్రీరామ్మూర్తి, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొని పోలియో ఆదివారం నిర్వహించారు. అయిదు సంవత్సరాల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు ప్రతి ఒక్కరు వేయించాలని తెలిపారు. అశ్వరావుపేట బస్ స్టాండ్ లో కూడా పిల్లలకు ఆశా కార్యకర్తలు పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది.
Post A Comment: