CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మండల వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం...

Share it:

 


మన్యం టీవీ : జూలూరుపాడు,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని అన్ని గ్రామాలలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమయింది. జూలూరుపాడు కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ బి వీరబాబు, డాక్టర్ సుధీర్ ,ఎంపీపీ సోనీ, జెడ్పిటిసి కళావతి, పిఎసిఎస్ చైర్మన్ వెంకటరెడ్డి, సిహెచ్ వెంకటేశ్వర్లు, పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు ఏసీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 5 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పిల్లలందరికీ తప్పకుండా వారి తల్లిదండ్రులు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని కోరారు. పిల్లల నిండు జీవితానికి "ఈ రెండు చుక్కలు" చాలా అవసరమని అన్నారు. ఈ కేంద్రాలు ఈరోజు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అందరికీ అందుబాటులో ఉంటాయన్నారు. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల లో గ్రామ సర్పంచులు, పల్స్ పోలియో కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వెంగన్నపాలెం ఎంపీటీసీ దుద్దుకూరి మధుసూదన్ రావు, నర్వ లేని పుల్లారావు, ఎల్లంకి చిన్న నాగేశ్వరరావు, ఆరోగ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: