మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం తిమ్మంపేట గ్రామంలో ఇటీవల అనారోగ్యం తో మరణించిన సామాజికఉద్యమ నేత, అంబేద్కర్ వాది, ఎంఆర్పీఎస్ నాయకులు, తిమ్మంపేట మాజీ ఎంపీటీసీ, సర్పంచ్ గోనె తిరుపతి కుటుంబాన్ని పరామర్శించటానికి మంగపేట విచ్చేసిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గోనె తిరుపతి ఫోటోకు పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం గోనె తిరుపతి గురించి మాట్లాడుతూ ఒక మంచి దళిత నాయకులు మననుండి దూరం అవటం మన దురదృష్టం సామాజిక, రాజకీయ రంగాలలో కూడా అగ్రవర్ణాలతో పోటీపడి ఎంపీటీసీ గా, సర్పంచ్ గా గెలిచినా, ఇది చాలదంటూ కులరహిత, మతరహిత సమాజం కోసంఅహర్నిశలు శ్రమించి అన్ని వర్గాల, సబ్బండ వర్ణాల మెప్పును పొందిన వ్యక్తి గోనె తిరుపతి అతని ఆశయాలను మనం అందరం కలిసి ముందుకు తీసుకవెళ్ళాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ ఎంఆర్పీఎస్ నాయకులు నెమలి నర్సయ్య, జిల్లా నాయకులు, శ్యాం, లక్ష్మణ్, శంకర్, ఎంపెల్లి వీరాస్వామి, ఎల్పీ ముత్యాలు, వావిలాల పోశయ్య, వావిలాల స్వామి, గోనె కేశవులు, నర్సింగరావు, నర్సింగ రావు, వర్మ, లక్ష్మి నారాయణ, కొప్పుల రాంబాబు, కొప్పుల శ్రీను, సుమన్, మచ్చ వీర్రాజు, సీపీ అశోక్, రమేష్, వెంకటనర్సమ్మ, సురేష్, రాజు, మల్లేష్, సోమ నర్సయ్య, బొర్రయ్య, ఎం ఆర్పీఎస్ సీనియర్ నాయకులు ఎంపెల్లి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: