యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వామి యాదవ్
మన్యం టీవీ మంగపేట.
మంగపేట .యాదవ కుల పోరాట సమితి (వై హెచ్ పి ఎస్ )మండల కార్యకర్తల సమావేశం ఆదివారం మండల కేంద్రంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో మండల ఇన్చార్జి సింగర్ బోయిన నరసయ్య యాదవ్ అధ్యక్షతన జరిగింది .ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రం స్వామి యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి చింతల కుమారస్వామి యాదవ్, మంగపేట సహకార సంఘం వైస్ చైర్మన్ కాడ బోయిన నరేందర్ యాదవ్, లు హాజరై మాట్లాడారు .యాదవులు కలిసికట్టుగా పోరాటాలు చేస్తూ తమ ఆత్మ గౌరవ ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు .రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత గొర్రెల పంపిణినివెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు .అనంతరం సంఘం ఎన్నికల స్టీరింగ్ కమిటీ ఎన్నుకున్నారు .
Post A Comment: