నూగురు వెంకటాపురం
మంగళ వారం నాడు గిరిజన కేంద్రమంత్రి మలోత్ కవిత ,గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వెంకటాపురం మండలాన్ని సందర్శించుట జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు పూనేం సాయి ఇద్దరు మంత్రులను కలిసి
భద్రచాలం గిరిజన ప్రతిభా పాఠశాలను ఖమ్మం పట్టణం నుండి మరలా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతానికి తీసుకురావాలని మెమోరాండం ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మంత్రి సత్యవతి రాథోడ్,కవితల కు వివరిస్తూ ఆంధ్ర తెలంగాణ విభజన సమయంలో భద్రాచలం ఎట్టపాక కేంద్రంగా ఉన్న గిరిజన ప్రతిభా పాఠశాల ను అకారణంగా ఖమ్మం పట్టణానికి తరలించుట జరిగిందని అన్నారు. అక్కడ అద్దె భవనాల్లో పాఠశాలను నిర్వహిస్తూ నెలకు 3లక్షల రూపాయలు అద్దె చెల్లిస్తూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఏజెన్సీ ప్రాంత పాఠశాలను మైదాన ప్రాంతమైన ఖమ్మం పట్టణానికి తరలించుట వల్ల ఏజెన్సీ ప్రాంత ఆదివాసీలు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఈ మధ్య జరిగిన ప్రతిభా పాఠశాల ప్రవేశాల్లో కేవలం లంబాడా వారికే 86 సీట్లు కేటాయించి 32 ఆదిమ తెగలకు 4 సీట్లు కేటాయించారని మంత్రులకు తెలియజేసారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అని అన్నారు. తక్షణమే ఖమ్మం నుండి గిరిజన ప్రతిభా పాఠశాలను ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలానికి తీసుకు రావాలని వారు కోరడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ పాఠశాలను భద్రాచలం తరలించాలని త్వరలోనే భద్రాచలం కేంద్రంగా ధర్నా నిర్వహించ నున్నట్లు ఆయన తెలియజేసారు.ఈ కార్యక్రమంలో నాయకులు భార్గవ్ ,శరత్ పాల్గొన్నారు.
Post A Comment: