CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రేగా విష్ణు మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడలపై సమీక్షా సమావేశం

Share it:

 



మన్యం టీవీ, బూర్గంపాడు:


తెలంగాణా ప్రభుత్వ విప్‌& పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు మణుగూరులో జరుగుతున్న ఆటల పోటీల గురించి మంగళవారం బూర్గంపాడు మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్ ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి మాట్లాడుతూ

ఆటల పోటీలు ముగింపు రోజున అనగా ఈ నెల 7వ తారీకు మన మండలం నుంచి భారీ ఎత్తున సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు తప్పనిసరిగా హాజరుకావాలని, అందరూ అన్ని క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని విజయం సాధించాలి అని ఆయన కోరారు . 

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యాలమ్మ, మాజీ ఎంపిటిసి తోటమల్ల సరిత, అన్ని గ్రామ పంచాయతీల సర్పంచ్లు, ఉప సర్పంచులు, వార్డ్ నెంబర్లు బూర్గంపాడు టౌన్ ప్రెసిడెంట్ గోనెల నాని, మండల నాయకులు పోతిరెడ్డి గోవిందరెడ్డి,పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: