CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెరాస నాయకులఆధ్వర్యంలో గ్రామ కమిటీ సమావేశాలు. పార్టీ బలోపేతానికి చర్యలు

Share it:

 


మన్యం టీవీ మంగపేట. 

ములుగు  జడ్పీ చైర్మన్ ,నియోజకవర్గ ఇంచార్జ్ కుసుమ జగదీష్ ఆదేశాల మేరకు తెరాస మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ  ఆధ్వర్యంలో  మంగపేట మండలం లో గ్రామ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది ,  ఈ రోజు అకినేపల్లి మల్లారం,కత్తిగూడెం, బ్రాహ్మణ పల్లి,  ,గ్రామ కమిటీ అధ్యక్షులు రూప భద్రయ్య, పండా శ్రీను ,  అధ్యక్షుతన  గ్రామ కమిటీ సమవేశం జరిగింది  ,గ్రామంలో  సమస్యలు ,పార్టీ బోలోపేతం, ఎమ్ ఎల్సీ  ఎన్నికల  గురించి  మాట్లాడటం జరిగింది. గ్రామ కమిటీ అధ్యక్షులు గ్రామ కమీటీ నాయకులు మాట్లాడుతూ  సీసీ  రోడ్లు,  మిషన్ భగీరథ నీళ్ల  లీకేజి ,భూమి పట్టాల  సమస్యలు, డబుల్ బెడ్ రూమ్  మరియు ఇతర సమస్యల గురించి మండల పార్టీ అధ్యక్షులకు చెప్పడం జరిగింది  

మండల పార్టీ అధ్యక్షులు మాట్లాడు భారతదేశం లో ఏ రాష్ట్ర లో కూడా అమలు కానీ సంక్షేమ పథకాలు మన తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి గౌ ,శ్రీ   కేసీఆర్  అమలు చేస్తున్నారు 

రైతు బంధు, కల్యాణి లక్ష్మీ,ఇరవైనాలుగు గంటల కరెంటు,  రైతు బీమా,మిషన్ భగీరథ ,కేసీఆర్ కిట్టు,వితంతువులకు  ఒంటరీ మహిళల ఫించన్లు  ఒక్క రూపాయికే బియ్యం వంటివి అనేక పథకాలు  ప్రవేశ పెట్టిన ఘనత మన   రాష్ట్ర ముఖ్యమంత్రి కే చెందుతుంది అని చెప్పారు 

అలాగే  గ్రామంలో  నా దృష్టికి వచ్చిన సమస్యలను ములుగు జడ్పీ చైర్మన్ ,నియోజకవర్గ ఇంఛార్జ్ కుసుమ జగదీష్  దృష్టికి తీసుకొని వెళ్ళి సమస్యలను   పరిష్కరిస్తామని మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ   అన్నారు  ఈ కార్యక్రమంలో పిఏసీఎస్  చైర్మన్ తోట రమేష్, సీనియర్ నాయకులు వాత్సవాయి శ్రీధర్ వర్మ, మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, మండల అధికార ప్రతినిధి కటికనేని  సత్యనారాయణ    శ్రీకాంత్ బాబు  మండల మీడియా ఇంక్ఇంఛార్జ్ గుడివాడ శ్రీహరి,నాగేశ్వరరావు, రాంబాబు,ముత్యాల రావు

 చింతలపల్లి సాంబశివరావు కల్తీ అశోకబాబు సున్నం నర్సింగరావు గొప్ప చంద్రకాంత్  కిషోర్  వెంకటేశ్వర్లు సంతోష్  మూడు గ్రామ కమిటీ అధ్యక్షులు ,కార్యదర్శి లు,అనుబంధ సంఘాల,  కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: