చండ్రుగొండ మన్యం టీవీ: చండ్రుగొండ మండలం లో టిడిపి వ్యవస్థ స్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం మండల కేంద్రంలో టిడిపి ఆధ్వర్యంలో వర్ధంతి సభను ఏర్పాటు చేసారు. వర్ధంతి సభలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు పార్టీ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటం ముందు పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ప్రజలు పడుతున్న బాధలను స్వయంగా పరిశీలించి ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో టిడిపి పార్టీని ఆవిర్భవించి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు పరిపాలన దగ్గరవ్వాలని నూతన మండలాలను ఏర్పాటు చేసిన పరిపాలనను ప్రజల వద్దకు తీసుకు వచ్చారని పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని వారి ఆశయాలను ఇకముందు కూడా ప్రజల్లోకి తీసుకు పోవాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి కొడకండ్ల వెంకటరెడ్డి, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంపీటీసీ దారా బాబు, టిడిపి మండల అధ్యక్షుడు వారధి సత్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి ఉన్నం నాగరాజు, షబ్బీర్ హుస్సేన్, సుండ్రు విజయ్, సిపిఐ పార్టీ నాయకులు గార్లపాటి రామనాథం, సిపిఎం పార్టీ మహిళా నాయకులు జై మునిషా బేగం, అటో యూనియన్ నాయకులు. హమాలి వర్కర్స్. పార్టీ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: