👉 యూటిఎఫ్ ఆధ్వర్యంలో నిరసన
మన్యం టీవి,పినపాక:
కేజీ బీవి , యు ఆర్ ఎస్ సమస్యల పరిష్కారం కోసం టి.ఎస్ యూటిఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కేజిబివి , యు ఆర్ ఎస్ సమస్యలపై 3 దశల పోరాటకార్యక్రమంలో భాగంగా ఈరోజు భోజన విరామ సమయంలో కేజిబివి
పినపాకలో నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజు మాట్లాడతూ సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలని సుప్రీం కోర్ట్ తీర్పు మేరకు ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా జీతాలను, సెలవులు ఇవ్వాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి టి.వి. ఎస్ ప్రసాద్, పినపాక మండల అధ్యక్షులు బి హనుమా, కరకగూడెం ప్రధాన కార్యదర్శి బి రాము, మణుగూరు అధ్యక్షులు ఇంద్రసేనా రెడ్డి, ఎస్. వో అరుణ ,బి పద్మ ,లలిత తదితరులు పాల్గోన్నారు.
Post A Comment: