మన్యం టీవి,పినపాక: మండలంలో రైతు కల్లాల ఏర్పాటుపై పంచాయతీ కార్యదర్శులు, సర్పంచుల తో బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ శ్రీనివాసులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీల్లో తప్పనిసరిగా రైతు కల్లాలు ఏర్పాటు చేసే విధంగా కార్యదర్శులు చొరవ తీసుకోవాలని సూచించారు. రైతులకు ఉపయోగపడే కల్లాల ఏర్పాటు పై రైతులకు అవగాహన కల్పించాలని కార్యదర్శులకు సూచించారు. ప్రభుత్వ స్కూల్ తెరుస్తున్న క్రమంలో పరిసరాలు శుభ్రంగా ఉంచాలని, స్కూల్లో ఆవరణంలో ప్రతిరోజూ తప్పనిసరిగా బ్లీచింగ్ మరియు శానిటైజర్ తయారు చేయాలని సర్పంచులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ మనోహర్, పి ఆర్ ఏ ఈ వెంకట్, ఈసి సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: