మన్యం టీవీ మంగపేట.
జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ ఢిల్లీ ప్రతినిధి ముకుంద కుమార్ చందన్ మరియు "స్పైసెస్ బోర్డు" తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ గాధి. లింగప్ప లను ""వికాస్ అగ్రి ఫౌండేషన్"" ఆధ్వర్యంలో "జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ" డైరెక్టర్ నాసిరెడ్డి. సాంబశివ రెడ్డి పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో వీరిద్దరూ చేస్తున్న కృషిని అభినందించారు. మునుముందు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వికాస్ అగ్రి ఫౌండేషన్ ప్రతినిధులు పచ్చి పులుసు. నరేష్, నేలపట్ల. శేషారెడ్డి, చెట్టుపల్లి. తిరుపతిరావు, రైతులు నాసిరెడ్డి. నరసింహారెడ్డి, గాలి శివాజీ, నారాయణరెడ్డి, నాగిరెడ్డి, హైదర్ వలి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: