CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కొనుగోలు కేంద్రాల రద్దునిర్ణయం ఉపసంహరించుకోవాలి

Share it:

 


 కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొంకతి సాంబశివరావు  డిమాండ్

మన్యం టీవీ మంగపేట. 

కొనుగోలు కేంద్రాల రద్దు నిర్ణయం ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. కొనుగోలు కేంద్రాలను పునరుద్ధరించి కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ మంగపేట మండల ప్రధాన కార్యదర్శి కొంకతి సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. మంగపేట మండల కేంద్రంలో  పాత్రికేయుల సమావేశంలోఆయన  మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు రాష్ట్ర ప్రభుత్వం పత్తాసు పలకటం సరికాదన్నారు. ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు స్వస్తి పలుకక పోతే తగిన గుణపాఠం తప్పదని ఈ సందర్బంగా హెచ్చరించారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను కొనసాగిస్తేనే రైతు రైతులకు మద్దతు ధర దక్కుతుందని అన్నారు. రైతును రాజు ని చేస్తానన్న ముఖ్యమంత్రి రైతుని ఇప్పుడు నట్టేట ముంచడం సరికాదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి కొనుగోలు కేంద్రాలు కొనసాగించాలి లేదంటే రైతుల పక్షాన కాంగ్రెస్ పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తా రొకోలు, నిర్వహిస్తామని తెలియజేసారు.

Share it:

TELANGANA

Post A Comment: