CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

శాంతి భద్రతలు కాపాడటంలో పోలీసుల పాత్ర మరువలేనిది...

Share it:

 



 జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి


సమాజంలో శాంతి భద్రతలు కాపాడటంలో పోలీసుల పాత్ర మరువలేనిదని ""జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్"" డైరెక్టర్ నాశిరెడ్డి. సాంబశివ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మంగపేట మండల కేంద్రంలో,  పోలీస్ స్టేషన్ లో ఇటీవల నూతన సబ్ ఇన్స్పెక్టర్ గా, బాధ్యతలు స్వీకరించిన మంగపేట సబ్ ఇన్స్పెక్టర్ చింతలతాడెం. శ్రీనివాస్ నీ, శాలువా కప్పి సన్మానించారు. అనంతరం ప్రత్యేకంగా కేరళ రాష్ట్రం నుండి తెప్పించిన ""స్పైస్ బుక్"" (సుగంధ ద్రవ్యాలతో కూడిన పుస్తక నమూనా) బాక్సును బహూకరించారు. ఈ సందర్భంగా సాంబశివ రెడ్డి మాట్లాడుతూ, మండలంలో  సమర్థవంతంగా శాంతి భద్రతలను కాపాడుతూ, ప్రజల మన్ననలు పొందే విధంగా పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతతో పోలీసు శాఖ మమేకమై పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. మారుమూల నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి దేశ రక్షణలో భాగస్వాములు చేసే దిశగా పోలీసు శాఖ చేస్తున్న కృషి హర్షణీయమన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: