CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మేకల దొంగలు అరెస్ట్.

Share it:

 


కరకగూడెం ఎస్ఐ ప్రవీణ్ కుమార్


మన్యం టీవీ: కరకగూడెం.ఈ     రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడులా బయ్యారం సర్కిల్ పరిధిలోని కరకగూడెం పోలిస్ స్టేషన్ పరిధిలో మేకల దొంగతనం చేస్తున్న ముగ్గురు దొంగలను అరెస్ట్ చేయడం జరిగింది. కరకగూడెం ఎస్ఐ జి.ప్రవీణ్ కుమార్ తెలిపిన 

వివరాలు.ఇల ఉన్నాయి.

1)పెనుగొండ నవీన్@బబులు s/o  నాగేశ్వరరావు,25 సం,, అర్/o మణుగూరు.

2)తాటి సత్యనారాయణ తండ్రి నర్సింహ రావు,20 సం, అర్/o పగిడేరు గ్రామము , మణుగూరు మండలం

3)చెల్లా సాయి మంజునాథ @సాయి తండ్రి సుదర్శన్,19 సం,, భగత్ సింగ్ నగర్, మణుగూరు.అను వారు గత సంవత్సరం ఆగష్టు లో బంగారు గూడెం స్టేజి వద్ద గల ఒక ఇంటి దగ్గర మేకల దొడ్డిలో 4 మేకలు మరియు కొత్త గూడెం గ్రామము లో గల మేకల దొడ్డి నుండి 4 మేకలను దొంగతనం చేయడం జరిగింది. ఈరోజు కరకగూడెం యస్. ఐ. జి. ప్రవీణ్ కుమార్  తన సిబ్బంది తో వీరాపురం క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా పై ముగ్గురు అనుమానాస్పదంగా కనిపించి పోలీస్ వారిని చూసి పారిపోతుండగా వారిని పట్టుకొని విచారించగా పై రెండు నేరాలు ఒప్పుకున్నారు. ముగ్గురి వ్యక్తుల వద్ద నుండి మొత్తం 8 మేకలను వీటి విలువ సుమారు 80,000/-రూపాయలు, మరియు దొంగతనం కి ఉపయోగించిన ఒక ఆటో, హీరో హోండా గ్లామర్ బైక్ ని స్వాధీనం చేసుకొని నేరస్తులని అరెస్ట్ చేయడం జరిగింది.ఈ కేసు ను ఛేదించడంలో చాకచక్యంగా వ్యహరించిన  యస్. ఐ.జి. ప్రవీణ్ కుమార్ ను మరియు హెడ్ కాన్స్టేబుల్ ఎస్ కె నసీర్ ను,కానిస్టేబుళ్లు టి. ఇందల్ ,మహేష్,సుబ్బారావు, పుల్లం దాస్, దుర్గారావు లని ఏడులా బయ్యారం సిఐ డి. రమేష్  మరియు మణుగూరు ఎ ఏఎస్పీ  డా,,పి. శబరిష్ ,ఐపీఎస్  అభినందించారు.

Share it:

TELANGANA

Post A Comment: