CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

28నుండి మణుగూరు - సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ రైలు పునరుద్ధరణ

Share it:


28న మణుగూరు‌-సికింద్రాబాద్‌ రైలు పునరుద్ధరణ

లాక్‌డౌన్ నేపథ్యంలో కొత్తగూడెం (భద్రాచలం రోడ్డు) రైల్వే స్టేషన్ నుంచి నడిచే ఆరు రైళ్లను రైల్వేశాఖ రద్దు చేసింది. దీంతో  పది నెలలుగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రయాణికుల కష్టాలను తీర్చేందుకు రైల్వే బోర్డు ఆదేశాల మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఈ నెల 28 నుంచి ఓ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌ను పునరుద్ధరించనున్నారు. మణుగూరు నుంచి  సికింద్రాబాద్ వరకు నడిచే ఈ ప్రత్యేక రైలు (ట్రైన్ నెం. 02745) 28న  సికింద్రాబాద్‌లో రాత్రి 11 గంటల 45 నిమిషాలకు బయల్దేరుతుంది.


మణుగూరు నుంచి (ట్రైన్.నెం. 02746) 29న  రాత్రి 10 గంటల 25 నిమిషాలకు సికింద్రాబాద్‌కు బయల్దేరనుంది. ఈ రైలు భద్రాచలం (కొత్తగూడెం) రోడ్, కారేపల్లి, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, జనగామ స్టేషన్లలో ఆగనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ ప్యాసింజర్ ట్రాఫిక్ మేనేజర్  విడుదల చేసిన సర్క్యూలర్‌లో  పేర్కొన్నారు.

Share it:

SLIDER

Post A Comment: