నూగూరు వెంకటాపురం
శుక్రవారంనాడు ఏటూరునాగారం ఐటీడీఏ పి.ఓ.హన్మంత్ జండగే కలిసి వినతి పత్రాన్ని అందించుట జరిగింది.వెంకటాపురం మండల కేంద్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగుతోందని ప్రభుత్వ భూముల క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయన్నారు.తాసిల్దార్ అలసత్వం ,స్థానిక పంచాయతీ అధికారి నిర్లక్ష్యంతో ఈ అక్రమ దందా కొనసాగుతోంది అని పి.ఓ.కి వివరించటం జరిగింది. ఆదివాసీ నవనిర్మాణ సేన పక్షాన ఎన్నో ఉద్యమాలు చేసినా ,తాసిల్దార్ కి వినతి పత్రాలు ఇచ్చిన ఉపయోగం లేకుండా పోతోందని అన్నారు.తాసిల్దార్ గ్రామ కంఠాల్లో క్రవిక్రయాలు జరుపుతుంటే నిద్ర పోతున్నారని పి.ఓ కి చెప్పటం జరిగింది.తక్షణమే బహుళ అంతస్తుల నిర్మాణాలు కూల్చివేయలని డిమాండ్ చేశారు.
Post A Comment: