మన్యంటీవీ,ములకలపల్లి:ములకలపల్లి మండలం, జగన్నాధపురం పంచాయతీలోని,నరసాపురం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న కల్వర్టు పనులకు జడ్పిటిసి సున్నం నాగమణి శంకుస్థాపన చేశారు.ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ కల్వర్టు పనులను నాణ్యత ప్రమాణాలతో త్వరగా పూర్తి చేయించాలని అధికారులకు చెప్పారు.అనంతరం జగన్నాధపురం గ్రామంలోని జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ ను సందర్శించారు.స్కూల్ ఉపాధ్యాయులు,ప్రధానోపాధ్యాయులు స్కూల్లో ప్రధాన సమస్య అయిన టాయిలెట్స్ గురించి తెలుపగా,సమస్య అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరిస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం భవాని,ఎంపీటీసీ సున్నం సునీత,ఎంపీడీవో ఆర్. చిన్ననాగేశ్వరరావు,పిఆర్ జేఈ,పామర్తి నాగేశ్వరరావు,కుంజా వెంకట్, కాంగ్రెస్ పార్టీ ములకలపల్లి మండల యువజన నాయకులు సోడే కళ్యాణ్ చక్రవర్తి,చిడిపి భాను తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: