మన్యం టీవీ మంగపేట.
దళిత నాయకుడు గోనె తిరుపతి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, సోమవారం మంగపేట మండలంలోని, తిమ్మంపేట గ్రామంలో సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య, జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి, బిజెపి గిరిజన మోర్చా అధికార ప్రతినిధి తాటి కృష్ణ, దళిత నాయకులు మండల ముఖ్య నాయకులు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం గోనె తిరుపతి కుటుంబానికి ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఆర్థిక సహాయం అందజేశారు. తిరుపతి కుటుంబానికి కి అన్ని వేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Post A Comment: