CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాశిరెడ్డి సాంబశివ రెడ్డి

Share it:

 


గోనె తిరుపతి మృతి దళిత సమాజానికి తీరని లోటు........


 

మన్యం టీవీ మంగపేట 

 దళిత నాయకుడు గోనె. తిరుపతి అకాల మరణం దళిత సమాజానికి తీరనిలోటని ""జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ"" డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మంగపేట మండలంలోని తిమ్మంపేట గ్రామంలో తిరపతి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం గోనె తిరుపతి చిత్రపటానికి పుష్పగుచ్ఛం ఉంచి, శ్రద్ధాంజలి ఘటించారు. తిరుపతి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని, తిరుపతి కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. మండల ముఖ్య నాయకుల్లో ఒకరైన తిరుపతి భౌతికంగా దూరం కావడం విచారకరమన్నారు.  గోనె తిరుపతి ఎంతో ఆశయంతో మొదలుపెట్టిన మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని సమిష్టి కృషితో పూర్తిచేయాలని అదే, తిరుపతికి  అర్పించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. పేద కుటుంబంలో పుట్టిన తిరుపతి తన కుమార్తెను డాక్టర్ గా వైద్యురాలిని చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు ఎల్ పి ముత్యాలు, ఏంపెళ్లి. వీరస్వామి, వావిలాల. పోశయ్య, గోనే వర్మ, పుల్లూరు. శ్రవణ్, గోనె. కేశవులు, నరసింహారావు, బోడ. బొర్రయ్య ,నాగిరెడ్డి, సతీష్ మరియు తిరుపతి కుటుంబ సభ్యులు డాక్టర్ మానస తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: