గుండాల మన్యం టీవీ: కుటుంబానికి జీవన ఆధారమైన పోడు భూమిని ఫారెస్ట్ అధికారులు తీసుకుంటారని బెంగతో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్న సంఘటన గుండాల మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పెద్దతోగు గ్రామ సమీపంలోని పోడు భూముల్లో అటవీశాఖ అధికారులు కందకాలు తీస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది రైతుల భూముల్లో కందకాలు తీశారు. కందకాలు తీస్తున్న పక్కనే వాగాబోయిన ముత్తయ్య ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పది ఎకరాల పోడుభూమి ఉంది. ఆ భూమిని ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకుంటారని భయంతో గత మూడు రోజులుగా బెంగ పెట్టుకొని ఉంటున్నాడు. తన భూమి ఫారెస్ట్ అధికారులు లాక్కుంటే కుటుంబం రోడ్డున పడుతుందని తీవ్ర మనస్తాపం చెంది శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడిని ఖమ్మం తరలించి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Navigation
Post A Comment: