చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి : చండ్రుగొండ స్థానిక బస్టాండ్ ఆవరణలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ, పొట్టిశ్రీరాములు, విగ్రహాలను తాసిల్దార్ వీరభద్ర నాయక్, ఎస్ఐ రాజ్ కుమార్ విగ్రహాలను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ మహనీయులు విగ్రహాలను ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్ తరాలను మంచి సంప్రదాయాన్ని, చరిత్రను తెలిపిన వారిగా మనం నిలుస్తామన్నారు. వారి ఆశయాలను సాధించేలా, మహనీయులు చూపిన బాటలో మనమంతా ప్రయాణించాలన్నారు. ఈ కార్యక్రమం లో ఎంపీపీ బానోతు పార్వతి, జడ్పీటీసీ కోణకండ్ల వెంకట రెడ్డి, సర్పంచ్ మాలిపేద్ది లక్ష్మి భవాని, ఎంపీటీసీ దారా బాబు, వైస్ ఎంపీపీ నారకుళ్ళ సత్యనారాయణ, తెరాస మండల అధ్యక్షులు మాలోతు భోజ్యనాయక్, తదితర మండల నాయకులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: