మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండలంలో అమ్మగారిపల్లి పంచాయతీ పరిధిలో గల అణుశక్తి నగర్ ఎస్సీ కాలనీకి చెందిన నండ్రు ముత్తయ్య ఇల్లు ప్రమాదవశాత్తు కాలిపోవడంతో సర్వం కోల్పోయి ఆ కుటుంబం నిర్వాసితులయ్యారు.ముత్తయ్య దినసరి కూలి కావడంతో ఇల్లు కాలిపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఐటీసీ- శ్రామిక శక్తి ఎంప్లాయిస్ అండ్ బదిలీస్ యూనియన్ ప్రెసిడెంట్ సానికొమ్ము శంకర్ రెడ్డి వారి ఇంటికెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు.తక్షణమే వారి కుటుంబానికి 50 కేజీల బియ్యం-నిత్యావసర వస్తువులు అందజేశారు.ఈ కార్యక్రమంలో శ్రామిక శక్తి యూనియన్ నాయకులు మహమ్మద్ ముస్తాఫా,రఘుపతి రెడ్డి,గద్దల నాగేశ్వరరావు లతో పాటు షేక్ సైదులు,బాల్ రెడ్డి,కాలవ భాను,నజీర్,గౌతమ్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: