CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉 పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

Share it:


గుండాల మన్యం టీవీ: మద్యం మత్తులో ఇంట్లో గొడవ పడి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి మూడు రోజుల అనంతరం వరి పొలాల్లో మృత దేహమై కనిపించాడు. ఈ సంఘటన మండలంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ ముత్యం రమేష్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పోతిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన వూకె కృష్ణ(38) నిత్యం మద్యం సేవిస్తూ ఇంట్లో గొడవ పడుతుంటాడు. ఈ క్రమంలోనే ఈనెల 19న ఇంట్లో గొడవ పడి బయటకు వెళ్ళిపోయాడు. గత మూడు రోజుల నుండి కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం బంధువులను అడుగుతున్నారు. శనివారం ఉదయం ఓ మేకలకాపరికి పెట్రోల్ బంక్ సమీపములో వరి పొలాల్లో ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అక్కడకు వెళ్లి చూడగా కృష్ణ మృతదేహం గా గుర్తించారు. మృతి చెందిన ప్రాంతంలో గన్ని కలుపు మందు, రెండు బీరు సీసాలు ఉన్నాయి. అయితే మృతుడు మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారణ అయింది. ఎస్ఐ ముత్యం రమేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: