బీటీ రోడ్డు కల నెరవేరేది ఎన్నడో... !
మన్యం టీవీ : జూలూరుపాడు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం, లోని చివారు ఆదివాసి గ్రామపంచాయతీ, "నల్లబండ బోడు" మండల కేంద్రానికి సుమారు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో పచ్చటి అడవి తల్లి ఒడిలో గుట్టల నడుమ ఈ గ్రామం ఉంటుంది. ఈ గ్రామంలో సుమారు 80 ఆదివాసి కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీరు కొన్ని దశాబ్దాలుగా ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నారు. ఇది ఒక రెవెన్యూ గ్రామం, కానీ, ఇప్పటికీ ఈ గ్రామానికి శాశ్విత రోడ్డు సౌకర్యం లేక ఇక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇక వర్షాకాలం లోనైతే వీరి బాధలు వర్ణనాతీతం కొన్ని సందర్భాలలో సరైన రహదారి లేకపోవడం వలన అక్కడి ప్రజలకు ప్రాణాపాయ స్థితి ఏర్పడినప్పుడు సకాలంలో వైద్యుల వద్దకు తీసుకురాలేక ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి .అక్కడి ప్రజలు ఎన్నోసార్లు ఎంతోమంది అధికారులకు, ప్రజాప్రతినిధులకు, దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఏ ఒక్కరూ వారికి ఈ రోజుకి న్యాయం చేయలేదు, తమ సమస్యలను పట్టించుకోవడం లేదంటూ.. గత శాసనసభ ఎన్నికలలో ఎన్నికలను బాయ్కాట్ చేస్తూ గ్రామస్తులందరూ ఓటింగ్ లో పాల్గొనకుండా తమ నిరసన తెలపగా..అధికారులు ,అభ్యర్థులు, తమ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఈనాటికీ నెరవేర్చలేదని వాపోయారు. ఇకనయినా అధికారులు, ప్రజా ప్రతినిధులు, మా గోడు ఆలకించి అనంతారం, నుండి నల్ల బండ బోడు, వరకు సుమారు మూడు కిలోమీటర్ల బీటీ రోడ్డును మంజూరు చేసి మా కష్టాలను తీర్చాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు.
Post A Comment: