నూగురు వెంకటాపురం
భద్రాచలం నియోజకవర్గ మున్నురుకాపు కోఆర్డినేటర్ గా వెంకటాపురం మండలానికి చెందిన ధనపనేని వెంకటేశ్వర్లు పటేల్ ను నియమించినట్లు రాష్ట్ర కన్వీనర్ సర్దార్ పుటం పురుషోత్తం రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో మున్నురు కాపులను సంఘటితం చేసి గ్రామ మండల కమిటీలను ఏర్పాటు చేయుటకు వెంకటేశ్వర్లు ను ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమార్ స్వామి అనుమతి తో నియమించినట్లు తెలిపారు. ఈసందర్భంగా వెంకటేశ్వర్లు పటేల్ మాట్లాడుతూ నియోజకవర్గ కో ఆర్డినేటర్ గా నాపై నమ్మకం తో నియమించినందుకు నియోజకవర్గం లో మున్నురు కాపు సంఘం బలోపేతం చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర కన్వీనర్ పురుషోత్తం రావు పటేల్ కు ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమార్ స్వామి పటేల్ కు రాష్ట్ర ఉమ్మడి జిల్లా, ములుగు జిల్లా మున్నురు కాపు నాయకులకు, సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు.
Post A Comment: