విజేతలకు బహుమతులు అందజేసిన తెరాస నాయకులు
మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలంలోని కమలాపురం లోని "బిల్ట్ కంపెనీ కాలనీ స్టాఫ్ క్లబ్ "ఆవరణం లో తెలంగాణా ద్రోణాచార్య యూత్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహించిన మండల స్థాయి "షటిల్ టోర్నమెంట్ "క్రీడలు ముగిసిన సందర్బంగా షటిల్ విజేతలకు తెరాస గ్రామ కమిటీ అధ్యక్షులు ఈదునూరి రవీందర్ ఆధ్వర్యంలో తెరాస మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు ప్రతినిధి కటికనేని దినకర్, ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, కే. వీ.వీ. జిల్లా అధ్యక్షులు ఖుర్బాన్ ఆలీ, మండల కార్యదర్శి గుడిసేవ నాగేశ్వరావు, తెరాస మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి, కే. వీ. వీ. జిల్లా నేత కోడం సత్యనారాయణ, కమలాపురం మీడియా ఇంచార్జి బీస్ సాంబయ్య, ద్రోణాచార్య, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: