CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పాఠశాలలను పరిశీలించిన ఎంపీపీ రేగా కాళిక

Share it:

 


  మన్యం టీవీ: కరకగూడెం.     వచ్చేనెల ఒకటి నుండి పాఠశాలలు పునః ప్రారంభం కానున్న సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆదేశాల మేరకు కరకగూడెం మండలంలోని కరకగూడెం(చిరుమళ్ళ)ఆశ్రమ ఉన్నత పాఠశాలలను కరకగూడెం మండల ఎంపీపీ రేగా కాళిక,ఏటీడబ్ల్యూఓ పూనెం నరసింహారావు  సందర్శించారు.ఈనెల 25 వరకు పాఠశాలలో పారిశుద్ధ్య,హైడ్రోక్లోరైడ్ పిచికారీ చేసి,తరగతి గదులు శానిటేషన్ తో శుభ్రపరచాలని ఆయా ప్రధానోపాధ్యాయులకు,ఉపాధ్యాయులు సూచించారు.వచ్చేనెల 1 నుండి ప్రారంభం కానున్న 9,10 ఆపై తరగతుల విద్యార్థుల తల్లిదండ్రుల సమ్మతితోనే పాఠశాలకు వచ్చేటట్లు చూడాలని వారికి సూచించారు.పాఠశాలలోని ఉపాధ్యాయులు సిబ్బంది,విద్యార్థులు కరోనా నిబంధనలు పాటించాలని,ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ఉపయోగించాలని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీను,ఎంపివో సునీల్,చిరుమళ్ళ సర్పంచ్ పాయం నర్సింహారావు,ప్రధాన ఉపాధ్యాయులు జగన్ నాయక్,ఉప సర్పంచ్ కొమరం వెంకటేశ్వర్లు,సెక్రెటరీ అనూష,ఇతరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: