జిల్లా చెర్ పర్సన్ కోవలక్ష్మి
ఎమ్మెల్యే ఆత్రంసక్కు
జైనూర్ : రక్త నిల్వలు పెంచడానికి కృషిచేయడం సంతోషకరంమని
జిల్లా చెర్ పర్సన్ కోవలక్ష్మి. ఎమ్మెల్యే ఆత్రంసక్కు అన్నారు. శుక్రవారం జైనూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ అసుప్రతి లో అస్రావెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు సయ్యద్ జవిద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినా రక్తదాన శిబిరాన్ని జిల్లా చైర్ పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రంసక్కు శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రక్త నిల్వలను పెంచ డానికి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమన్నారు. ప్రస్తుతం బ్లడ్ బ్యాంకుల్లో రక్తనిల్వలు తగ్గిపోవడంతోపాటు తలసేమియా , ఇతరత్రా వ్యాధి గ్రస్తులకు రక్తం ఉపయోగపడుతుందని , రక్తదాతలు ముందుకువచ్చి రక్తదానం చేయడం చాలా గొప్ప విషయమన్నారు . అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని , రక్తదానం చేద్దాం ..అనంతరం సొసైటీ అధ్యక్షుని సల్వా తో సన్మానం చేశారు ఇతరుల ప్రాణాలు కాపాడుదాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జైనూర్ మండల ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Post A Comment: