నివాళులు అర్పించిన మణుగూరు మండల ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు
మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం, తోగూడెం పంచాయతీ, గోపాల్ రావు పేట గ్రామానికి చెందిన స్వతంత్ర సమరయోధులు *బొలిశెట్టి నరసింహయ్య* 100 సంవత్సరాలు.మంగళవారం ఉదయం మృతి చెందారు.విషయం తెలుసుకున్న మణుగూరు మండల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఈయన స్వతంత్ర సంగ్రామం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో చురుకుగా పాల్గొన్నారు అని,బోలిశెట్టి నర్సింహయ్య గ్రామ సర్పంచ్ గా 18 సంవత్సరాలు పని చేశారు అని,రాష్ట్ర పెరిక సంఘం హైదరాబాద్ ఉపాధ్యక్షులుగా,వివిధ హోదాల్లో వీరు సేవలందించారు అని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెరిక కుల సంఘానికి వారి సహాయ సహకారాలు అందించారు.బొలిశెట్టి నరసయ్య మృతి తీరనిలోటని ఆయన సేవా కార్యక్రమాలను వారు నెమరువేసుకున్నారు.ప్రభుత్వ విప్ పినపాక శాశన సభ్యులు రేగా కాంతారావు వారి కుటుంబ సభ్యులను ఫోన్ లో పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం నర్సింహారావు,ఎంపీపీ, కారం విజయకుమారి,కో అప్షన్ జావిద్ పాషా, మండల,టౌన్ అధ్యక్షులు ముత్యం బాబు,అడపా అప్పారావు,టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి నవీన్,పినపాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,నియోజకవర్గ యువజన అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్, టిఆర్ఎస్ నాయకులు ముద్దంగుల కృష్ణ,తంత్రపల్లి కృష్ణ,ఉప్పుతల రామారావు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: