కాళేశ్వరం పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ సతీసమేతంగా కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు కేసీఆర్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముక్తేశ్వర స్వామికి సీఎం దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు దగ్గరుండి స్వామివారికి అభిషేకం చేయించి, ఆశీర్వచనాలు ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు.
సీఎం పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ దర్శనం తరువాత మధ్యాహ్నం సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో కాళేశ్వరం రిజర్వాయర్ను పరిశీలిస్తారు. ఆ తర్వాత లక్ష్మీ బ్యారేజ్కు చేరుకొని అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. యాసంగికి సాగునీటి విడుదల తదితర అంశాలపై ఆయన అధికారులతో చర్చిస్తారు.
Post A Comment: