కరకగూడెం మండల కేంద్రంలో స్థానిక పి.హెచ్.సి నందు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎంపీపీ రేగా కాళిక రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మొదటి వ్యాక్సిన్ బుర్దారం గ్రామానికి చెందిన ఆశ వార్కర్ పోలెబోయన సత్యవతి వేసుకునందుకు ఎంపీపీ రేగా కాళిక అభినందించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ... కరోనా వ్యాక్సిన్ మొదటగా భారతదేశంలో ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు.ప్రజలు ఆందోళన చెందకుండా వ్యాక్సిన్ వేసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు.కోవిడ్ వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైన వ్యాక్సిన్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పర్షియా నాయక్,డిప్యూటీ డిఎంఎచ్ఓ మోకాళ్ళ వెంకటేశ్వర్లు,ఎంపీడీవో శ్రీను,స్పెషల్ ఆఫీసర్ గొంది వెంకటేశ్వర్లు,స్థానిక సర్పంచ్ ఊకే రామనాథం,ఉప సర్పంచ్ రావుల రవి,ఏఎన్ఎంలు,ఆశా కార్యకర్తలు,అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: