CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గిరిజనుల సాగులో ఉన్న భూములు తీసుకోవాలని చూస్తే సహించం సిపిఎం చర్ల

Share it:


  మన్యం టీవీ చర్ల: చర్ల మండలంలోని ఉప్పరగూడెం గన్నవరం గ్రామాలలోని గిరిజనులు గత పది సంవత్సరాలుగా సాగుచేసుకుంటున్న పోడు భూములను తీసుకునేందుకు మరియు భూమి చుట్టూ జెసిబి తో కందకాలు తవ్వేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నిస్తుండగా గ్రామస్తులు మరియు సిపిఎం సభ్యులు అడ్డు పడటం జరిగింది. సింగసముద్రం గ్రామంలో గిరిజన ప్రజలు ఫారెస్ట్ అధికారులు అడ్డగించి జెసిబి ని ఆపి వేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకుడు కొండా చరణ్ మాట్లాడుతూ గిరిజనులకు జీవనాధారం అయిన కోడు భూములను దౌర్జన్యంగా తీసుకోవాలని ఫారెస్ట్ అధికారులు చూడటం దారుణమని అన్నాడు. అటవీ హక్కుల చట్టం ప్రకారం ఒక్కో గిరిజనుడికి పది ఎకరాల భూమి ఉందని అన్నాడు. ఇక్కడ గిరిజనులకు కేవలం రెండు ఎకరాలు మాత్రమే పోడు భూమి ఉందని దానిని కూడా ఈ అధికారులు తీసుకుంటే  ఎలా బ్రతకాలి అని ప్రశ్నించారు. సాగులో ఉన్న సెంటు భూమిని కూడా తీసుకోవడానికి వీలు లేదంటూ వెంటనే జెసిబి ని వెనక్కి వెల్లమని నినాదాలు చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: