*10లక్షల వరకు బ్యాంకులు,
ష్యూరిటీ,గ్యారంటీలతో ఎలాంటి సంబంధం లేకుండా రుణాలందించాలి తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ఉప అధ్యక్షులు గంపల శివ
మన్యంటీవీఏటూర్ నాగారం:
ఎస్సీకార్పొరేషన్ రుణాల కోసం నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకునే చివరి తేదీని ఈనెల 31నుంచి ఫిబ్రవరి 21వరకు పెంచాలని తెలంగాణ మాల మహా నాడు రాష్ట్ర ఉప ఆద్యక్షుడు గంపల శివ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి, టీకాల కార్యక్రమం, సంక్రాంతి సెలవుల కారణంగా చాలా మంది ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోలేక పోయారని పేర్కొన్నారు తాసిల్దార్ కార్యాలయంలో కులం నివాసం ఆదాయ ధ్రువీకరణ పత్రాలు కూడా సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నారు.ఈ దృష్ట్యా దరఖాస్తు చేసుకునే ఆఖరు తేదీని ఫిబ్రవరి 21వ తేదీ వరకు పెంచాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు .అదేవిధంగా 10లక్షల రూపాయల వరకు బ్యాంకులు,ష్యూరిటీ గ్యారంటీలతో ఎటువంటి సంబంధం లేకుండా రుణాలు మంజూరు చేయవలసిందిగా పేర్కొన్నారు. ,బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలందించాలనే అంశాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టి సారించాలన్నారు.
Post A Comment: