మన్యం టీవీ,పినపాక
ఆత్మ ఆధ్వర్యంలో పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ వారు ఖనిజలవణాల మిశ్రమము, బాహ్య పరాన్న జీవుల నివారణ సూపర్ నేపియర్ గడ్డి మీదా తో గూడెం గ్రామ పంచాయతీలో రైతు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ పోనుగోటి భద్రయ్య, బి.టి.టి కన్వీనర్ తాతారావు మాట్లాడుతూ ఖనిజ లవణాల ఈ మిశ్రమం వల్ల పాల దిగుబడి పెరుగుతుందని పాల నాణ్యత కూడా బాగుంటుందన్నారు. లేగదూడలు బలంగా ఉండి , రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది అన్నారు. ప్రజల్లో సంతానోత్పత్తి శక్తి కూడా పెరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మణుగూరు వెటర్నరీ డాక్టర్ శిరీష, పినపాక వెటర్నరీ డాక్టర్ బాలకృష్ణ చౌహన్, బి.టి.ఏం రవికుమార్, ఏటీఎం పవన్ కుమార్, గ్రామ సర్పంచ్ లు, రైతులు పాల్గొన్నారు.
Post A Comment: